మీ పాయింట్లు
pts
Explore Mana Mangalagiri App to Earn More
ప్రభుత్వ అధికారం
నుండి ధృవీకరించబడింది December 2024.
Anonymous Post
This post was shared anonymously. The user has chosen to hide their identity.
Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.
రహదారికి మరమ్మతులు
-మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు
మంగళగిరి:
మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి చినకాకాని ఎన్నారై ఆసుపత్రి సమీపంలోని రహదారికి మరమ్మతులు పూర్తి చేశారు. ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా రహదారి పక్కనే ఉన్న డ్రైనేజి కాలువ పొంగి ప్రవహించడంతో రహదారి గుంతలు మయంగా మారి స్థానిక ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల సమస్యపై స్పందించిన నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ గుంతలమయంగా మారిన రహదారికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించాలని నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు సుమారు రూ.5లక్షల వ్యయంతో రహదారికి మరమ్మతులు పూర్తి చేశారు. కార్పోరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ ల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో శాశ్వత రహదారి నిర్మాణాలు చేపట్టే విషయంలో కొంత జాప్యం జరుగుతోందని, వీలైనంత త్వరలోనే భూగర్భ డ్రైనేజీ నిర్మాణాలతో పాటు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా శాశ్వత రహదారుల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. కాగా గుంతలమయంగా మారిన రహదారికి మరమ్మతులు నిర్వహించి తమ రాకపోకల ఇబ్బందులను తీర్చిన మంత్రి నారా లోకేష్ కు, నగరపాలక సంస్థ అధికారులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.