Upgrade Your Business

Get full access to Mana Mangalagiri with premium features and increased visibility

1 Month Plan
₹58 50% OFF
₹29
Billed monthly
3 Months Plan
₹177 51% OFF
₹87
Billed every 3 months (₹29/month)
×

Request Already Submitted

You have already submitted a request to upgrade your business. Please wait for our team to process it.

×
Mangalagiri News  (వార్తలు)

Mangalagiri News (వార్తలు)

@mangalagirinews

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

వెరిఫైడ్ బిజినెస్లు

This verified Business Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

1 d ట్రాన్స్‌లేట్

మీ పాయింట్లు

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 కామెంట్స్
+15 కొత్త పోస్ట్
+5 లైక్
+15 బ్లాగ్

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

అన్‌వెరిఫైడ్ యూజర్

ఇది ధృవీకరించబడని వినియోగదారు. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

టైలర్స్ డే వేడుకల్లో పాల్గొన్న చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి నియోజకవర్గంలో టైలర్స్ డే వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. పట్టణంలోని ఈద్గా కమ్యూనిటీ హాల్ ఆవరణ వేడుకల సందడితో కళకళలాడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన APMSIDC చైర్మన్ & జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి సంఘం ప్రతినిధులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు.

అనంతరం, రాష్ట్ర టైలర్స్ సంఘం వ్యవస్థాపకులు ఆకాశపు నరసింహమూర్తి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హో, టైలర్స్ డే సృష్టికర్త కె.ఎం. స్వామి గార్ల సేవలను స్మరించుకుంటూ టైలరింగ్ వృత్తి గొప్పతనాన్ని కొనియాడారు.

ప్రతి టైలర్‌కు హృదయపూర్వక టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కష్టానికి, నైపుణ్యానికి సమాజం ఎల్లప్పుడూ కృతజ్ఞతగా నిలుస్తుందని

టైలర్లు సమాజానికి అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించే కళాకారులని చిల్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. “ఒకరు గుడ్డ నేస్తే, మరొకరు దానిని అందమైన వస్త్రంగా మలుస్తారు. ఈ రెండు వృత్తులు కలిసే మన సంస్కృతి, సంప్రదాయం సజీవంగా నిలుస్తుంది” అని అన్నారు.

ప్రభుత్వం టైలర్ల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఆధునిక కుట్టు యంత్రాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, స్వయం ఉపాధి రుణాలు, సబ్సిడీలు, హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు కల్పిస్తున్నదని వివరించారు. ఎంఎస్ఎంఈ రుణాల ద్వారా టైలర్లు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ఏపీ టైలర్స్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ ఆకాశపు స్వామి, మాజీ ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి, అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ – మంగళగిరి అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా, ప్రధాన కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జెఎస్ఆర్), కూటమి నాయకులు, టైలర్స్ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.

image
5 వీక్షణలు
1 d ట్రాన్స్‌లేట్

మీ పాయింట్లు

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 కామెంట్స్
+15 కొత్త పోస్ట్
+5 లైక్
+15 బ్లాగ్

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

అన్‌వెరిఫైడ్ యూజర్

ఇది ధృవీకరించబడని వినియోగదారు. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

కార్మికులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి...
*********
భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం కల్పించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జీ ప్రభాకరరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ కార్మికులకు పలు సదుపాయాలు కల్పిస్తూ జీవో విడుదల చేసిన సందర్భంగా స్థానిక మంగళగిరి- తాడేపల్లి - దుగ్గిరాల ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ యూనియన్ నాయకులతో కలిసి శనివారం ఆయన వివరాలు అందజేశారు. మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ మండలాల నుంచి 12 వేల 936 మంది భవన నిర్మాణ కార్మికులు లేబర్ ఆఫీసులో నమోదు చేసుకున్నారన్నారు. మూడు మండలాల్లో సుమారు 30 నుండి 40 వేల కార్మికుల వరకు ఇంకా నమోదు చేసుకొని లేబర్ కార్డులు పొందాల్సి ఉందన్నారు. ప్రభుత్వం కార్మికులకు కాన్పుకి 20 వేలు, వివాహానికి 40 వేలు, మరణం సంభవించినప్పుడు 60 వేలు, మట్టి ఖర్చులకు 20 వేల రూపాయలు పథకాలు అమలులో ఉన్నాయన్నారు. భవన నిర్మాణంలో పనిచేసే 46 రకాల వృత్తుల వారు భవన నిర్మాణ కార్మికులుగానే గుర్తిస్తారన్నారు. సంవత్సరానికి 12 రూపాయలు చెల్లించి లేబర్ కార్డు పొంది ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. లేబర్ కార్డులు తీసుకునే విధంగా మేస్త్రిలు, యూనియన్ నాయకులు కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి- తాడేపల్లి - దుగ్గిరాల ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ యూనియన్ అధ్యక్షులు అన్నం నాగబాబు, యూనియన్ కోశాధికారి కాగిత శ్రీనివాసరావు, నాయకులు శృంగారపాటి శ్రీహరి, చిట్టిబొమ్మ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

image
5 వీక్షణలు
1 d ట్రాన్స్‌లేట్

మీ పాయింట్లు

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 కామెంట్స్
+15 కొత్త పోస్ట్
+5 లైక్
+15 బ్లాగ్

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

అన్‌వెరిఫైడ్ యూజర్

ఇది ధృవీకరించబడని వినియోగదారు. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

భక్తుల సేవలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్...
**********
మంగళగిరి మిద్దె సెంటర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారి బ్రహ్మోత్సవం మిద్దె సెంటర్ కు చేరుకున్న సమయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవా ట్రస్ట్ ప్రతిరోజు భక్తులకు భారీగా ప్రసాదాలు పంపిణీ చేస్తూ పలువురి భక్తుల మన్ననలు పొందుతుంది. పట్టణానికి చెందిన పణిదపు శ్రీనివాసరావు వ్యవస్థాపకులు గా, 121 మంది సభ్యులతో ట్రస్ట్ ఏర్పాటు అయింది. 2006 నుంచి ట్రస్ట్ ప్రతి ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు స్వామివారి బ్రహ్మోత్సవం మిద్దె సెంటర్ కు రాగానే ట్రస్ట్ ప్రతినిధులు భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తూ ఉంటారు. మిద్దె సెంటర్లో ట్రస్ట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి తోపాటు వివిధ రకాల స్వామివార్లను విద్యుత్ దీపాలతో ఏర్పాటు, సెంటర్ ను రంగు రంగు విద్యుత్ దీపాలతో అలంకరించి బ్రహ్మోత్సవాల శోభను తీసుకొస్తుంది. పొన్న వాహనం ఉత్సవం రోజున పలు సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులకు ఆధ్యాత్మిక వినోదాన్ని కలిగిస్తుంది. పులిహోర, చక్కర పొంగలి, శనగ గుగ్గిళ్ళు, కేసరి, లడ్డులు ఈ విధంగా రోజుకో రకం ప్రసాదం చొప్పున సుమారు నాలుగువేల మందికి పంపిణీ చేస్తూ ట్రస్ట్ పలువురు భక్తుల ఆదరాభిమానాలను పొందుతుంది. ట్రస్ట్ ను ఆదరిస్తూ సహాయ, సహకారాలు అందిస్తున్న దాతలు, అధికారులకు ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు, సభ్యులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

image
7 వీక్షణలు
2 d ట్రాన్స్‌లేట్

మీ పాయింట్లు

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 కామెంట్స్
+15 కొత్త పోస్ట్
+5 లైక్
+15 బ్లాగ్

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

అన్‌వెరిఫైడ్ యూజర్

ఇది ధృవీకరించబడని వినియోగదారు. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో బ్లూ జెట్ హెల్త్ కేర్ యూనిట్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

రూ.2,300 కోట్ల పెట్టుబడి, 1,750 మందికి ఉద్యోగాలు కల్పించనున్న బ్లూ జెట్

అనకాపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఉత్తరాంధ్రలో మరో భారీ ఔషధ తయారీ పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని సీతపాలెం వద్ద ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్) లో ప్రముఖ ఫార్మా కంపెనీ బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ముందుగా రాంబిల్లి మండలంలోని సీతపాలెం ఇండస్ట్రియల్ పార్క్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు కంపెనీ ప్రతినిధులు, కూటమి నేతలు మంగళవాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం బ్లూ జెట్ హెల్త్ కేర్ పరిశ్రమకు మంత్రి లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. రాంబిల్లి మండలం ఇండస్ట్రియల్ పార్క్ లో బ్లూ జెట్ పరిశ్రమ ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియట్లు, కాంట్రాక్ట్ డెవలప్ మెంట్ తయారీ యూనిట్ ను ఏర్పాటుచేయనుంది. ఇందుకు రూ.2,300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 1,750 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రత్యేక ఔషధ, ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన బ్లూజెట్ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం 102.48 ఎకరాలను కేటాయించింది. మూడు దశల్లో ఫార్మా కంపెనీని నిర్మించనున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్, బీయలమంచిలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఏపీఆర్డీసీ ఛైర్మన్ పి.నాగేశ్వరరావు, బ్లూ జెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ అక్షయ్ బన్సారీలాల్ అరోరా, మేనేజింగ్ డైరెక్టర్ శివెన్ అరోరా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేణుబాబు, సహ వ్యవస్థాపకులు & ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరేష్ షా, కలెక్టర్ విజయ కృష్ణన్, బ్లూ జెట్ హెల్త్‌కేర్ బృంద సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ఏపీఐఐసీ, వివిధ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

image
8 వీక్షణలు
5 d ట్రాన్స్‌లేట్

మీ పాయింట్లు

pts

Explore Mana Mangalagiri App to Earn More

+10 కామెంట్స్
+15 కొత్త పోస్ట్
+5 లైక్
+15 బ్లాగ్

ప్రభుత్వ అధికారం

ఇది ధృవీకరించబడిన ప్రభుత్వ అధికారం. Learn more

నుండి ధృవీకరించబడింది December 2024.

Anonymous Post

This post was shared anonymously. The user has chosen to hide their identity.

Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.

అన్‌వెరిఫైడ్ యూజర్

ఇది ధృవీకరించబడని వినియోగదారు. Learn more

Verified Business

This verified Business Learn more

Verified since December 2009.

మంగళగిరిలో శరవేగంగా పలు అభివృద్ధి పనులు

రూ. 35 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో అంగన్వాడీ, పాఠశాల భవనాలు ఆధునీకరణ

విద్యార్థులకు అందుబాటులోకి ఆధునిక సౌకర్యాలు

మంగళగిరి టౌన్: రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి నియోజకవర్గం రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో మౌలిక సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో మంగళగిరి మండలం, ఆత్మకూరు గ్రామంలో కోకా కోలా ఇండియా వారి సీఎస్‌ఆర్ నిధులు రూ. 35 లక్షలతో పలు అంగన్వాడీ, పాఠశాలలో వివిధ రకాల అవసరాలు, అభివృద్ధి చర్యలు చేపట్టారు. అంగన్వాడీ-52, అంగన్వాడీ-53, అంగన్వాడీ-54 లను ఆధునికరించారు. అంగన్వాడీ-62 కు స్మార్ట్ టీవీ అందజేశారు. అలాగే జిల్లా పరిషత్ హైస్కూలును ఆధునీకరించి ఒక మోనిటర్, రెండు స్పీకర్లు, ఒక డెస్క్‌టాప్, 6 సీసీ కెమెరాలు, 20 జతల స్పోర్ట్స్ డ్రస్‌లు అందజేశారు. మంత్రి నారా లోకేష్ కృషితో మంగళగిరి ప్రజలు, స్థానిక విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

image
28 వీక్షణలు