Your Points
Notice: Undefined index: user in /home/manamangalagiri.com/public_html/themes/wondertag/layout/story/includes/header.phtml on line 1016
Notice: Trying to access array offset on value of type null in /home/manamangalagiri.com/public_html/themes/wondertag/layout/story/includes/header.phtml on line 1016
pts
Explore Mana Mangalagiri App to Earn More
Anonymous Post
This post was shared anonymously. The user has chosen to hide their identity.
Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.
*కార్ల అద్దాలు పగులగొట్టిన గుర్తు తెలియని దుండగుడు*
*-రెండు ల్యాప్ టాప్ లు రూ. 5 వేల నగదు అపహరణ*
*-రూరల్ పోలీసులకు ఫిర్యాదు*
*మంగళగిరి
రెండు వేర్వేరు కార్ల అద్దాలను పగులగొట్టి రెండు లాప్ టాప్ లను, రూ.5వేల నగదును చోరీ చేసిన ఘటన మంగళగిరి రూరల్ స్టేషన్ పరిధి చిన కాకాని మురుగన్ హోటల్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు... డీబీఎస్ బ్యాంక్ ఏపీ, టీఎస్ రాష్ట్రాల హెడ్ శ్రీనివాస్ సెల్వరాజ్ విధుల నిమిత్తం విజయవాడ బ్యాంకుకు వచ్చారు. అక్కడ విధులు ముగించుకుని విజయవాడ క్లస్టర్ హెడ్ సుధాకర్ తో పాటు మరి కొందరు సిబ్బందితో కలిసి కారులో గుంటూరు బ్యాంకు కు బయలుదేరాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనం చేసేందుకు మార్గ మధ్యలోని మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి చినకాకాని జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న మురుగన్ హోటల్ వద్ద ఆగారు. అదే సమయంలో బద్వేల్ కి చెందిన సాయిరామ్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి యర్రబాలెంలో తాము గతంలో కొనుగోలు చేసిన స్థలం చూడటానికి వచ్చి భోజనం చేసేందుకు తన కారులో మురుగన్ హోటల్ కు చేరుకున్నారు. ఇరువురూ కార్లను పక్కపక్కనే పార్కింగ్ చేసి భోజనం చేయడానికి లోపలికి వెళ్లారు. భోజనం చేసిన అనంతరం బయటకు వచ్చి చూడగా తమ కార్ల అద్దాలు పగులగొట్టి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. తాము కార్ల లోపల పెట్టిన రెండు లాప్ టాప్ లు అపహరణకు గురైనట్లు గుర్తించారు. శ్రీనివాస్ సెల్వరాజ్ కారులోని ల్యాప్ టాప్ తో పాటు క్రెడిట్, డెబిట్ కార్డులు అపహరణకు గురి కాగా సాయిరామ్ తన కారులోని బ్యాగులో లాప్ టాప్ తో పాటు రూ. ఐదువేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. కార్ల అద్దాలు పగులగొట్టి లాప్ టాప్ లను చోరీ చేసిన ఘటనపై బాధితులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
*News By
*ఎన్.ఎన్.రాజు, జర్నలిస్ట్✍️.*
